Tuesday, May 23, 2023

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొన్న

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా తిరుపతి ఎంపీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి కేక్ కట్ చేసి కార్యకర్తలకి పంచి పెట్టారు. విజయవంతంగా నాలుగు సంవత్సరాలు సంక్షేమ పాలన అందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే తిరుగులేని విజయాన్ని అందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసారు. తదుపరి ఆయన మాట్లాడుతూ ప్రజా రంజక పాలన అందిస్తున్న మా ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని మళ్ళీ మళ్ళీ జగన్ అన్నే ముఖ్యమంత్రి అవుతారని 2024 లో కూడా ఇంతకు మించిన మెజారిటీతో విజయం సాధిస్తామని తెలియజేసారు.

No comments:

Post a Comment

కొమ్మిలో పోలేరమ్మ పొంగళ్ళు

కొండాపురం: కొమ్మిలో పోలేరమ్మ పొంగళ్ళు కొండాపురం మండలం కొమ్మి పంచాయతీలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి కు మంగళవారం పొంగళ్ళు పెట్ట...